Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పౌరుల సమస్యలపై వెంటనే స్పందించాలి:చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్

    Author RAJANEETHI | 20 Jul 2026, 04:45 PM | ANDHRA PRADESH
    పౌరుల సమస్యలపై వెంటనే స్పందించాలి:చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్

    ప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోండి...

    చిత్తూరు కార్పొరేషన్‌లో పీజీఆర్ఎస్‌కు 9 వినతులు...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హమైన వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఆయన, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే వేదిక అని పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో అందించే ప్రతి ఫిర్యాదు, వినతిని సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా కాలపరిమితిలో చర్యలు పూర్తి చేసి బాధితులకు సమాచారం అందించాలని ఆదేశించారు.గత వారం పీజీఆర్ఎస్‌లో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిగతులను కమిషనర్ సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న వినతులపై కారణాలు అడిగి తెలుసుకుని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 9 వినతులు అందాయి. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, ఆస్తి పన్ను తదితర పౌర సమస్యలకు సంబంధించిన వినతులను అధికారులు నమోదు చేశారు. ప్రతి వినతిపై సంబంధిత విభాగాలు వెంటనే చర్యలు ప్రారంభించి, నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని కమిషనర్ ఆదేశించారు.ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా నగరపాలక సంస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.కార్యక్రమంలో సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్, ఎంహెచ్వో డా. లోకేష్, ఎంఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ నాగేంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి