Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలికిరి మండలం లో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి

    కలికిరి మండలం లో  డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి

    ఈరోజు బుధవారం ఉదయం కలికిరి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి STD హరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి* సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.డాక్టర్ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేశారు.*ఆరోగ్యశ్రీ* ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించారు.*108 అంబులెన్స్, **104 ఆరోగ్య సేవలు* ద్వారా అత్యవసర వైద్య సేవలను ప్రతి గ్రామానికి చేరవేశారు.*ఉచిత విద్యుత్* అందించి రైతులకు అండగా నిలిచారు.జలయజ్ఞం* ద్వారా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.ఇందిరమ్మ ఇళ్లు* ద్వారా పేదలకు సొంత ఇంటి కలను నిజం చేశారు.ఫీజు రీయింబర్స్‌మెంట్* ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా చేశారు.*రెండు రూపాయల బియ్యం, **సామాజిక పెన్షన్లు* ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించారు.
    *రైతు రుణ మాఫీ, **ఉచిత విద్యుత్* వంటి పథకాలతో రైతుల కష్టాలను తగ్గించారు.
    *మైనార్టీలు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు* అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.
    అందుకే డాక్టర్ వైఎస్ఆర్ గారు కేవలం ఒక నాయకుడు కాదు... *పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానేత.* ఆయన ఆశయాలను కొనసాగించడం, ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో గొట్టపాలెం ద్వారకనాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, కే.ఎం భాష, ఓబయ్య, కుమార్, ప్రభాకర్ రెడ్డి, కెఎంఆర్ బాబాజాన్, లుక్మాన్, సుభాన్, జావీద్, సౌకత్, ముదామిల్, గుండా సతీష్, డీజే శామ్యూల్, విజయ్, ముబారక్, ఇస్తక్ అహ్మద్ గడి, మలతోటి నరేష్

    అత్యధికంగా చదివినవి