Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తక్షణ చర్యతో నీటి సమస్యకు పరిష్కారం.. ఈవో రమేష్‌పై కాలనీవాసుల ప్రశంసలు

    Author RAJANEETHI | 24 Jun 2026, 07:42 AM | ANDHRA PRADESH
    తక్షణ చర్యతో నీటి సమస్యకు పరిష్కారం.. ఈవో రమేష్‌పై కాలనీవాసుల ప్రశంసలు

    రేణిగుంట పంచాయతీ పరిధిలోని సీబీఐడీ కాలనీ వెనుక భాగంలో ఉన్న బాలాజీ నగర్‌లో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి రమేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. పరిశీలనలో సర్కార్ చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, మోటార్లు పనిచేయక నీటి సరఫరా అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి నీటి సరఫరా పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు ఈవో రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    అత్యధికంగా చదివినవి