Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మానవత్వానికి మారుపేరు.. మాజీ సర్పంచ్ నగేశం

    Author RAJANEETHI | 14 Aug 2026, 12:25 PM | ANDHRA PRADESH
    మానవత్వానికి మారుపేరు.. మాజీ సర్పంచ్ నగేశం

    రేణిగుంట, ఆగస్టు 14 (రాజనీతి): మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పే ఘటన రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో చోటుచేసుకుంది. మండుటెండలో దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయంగా పడి ఉన్న ఓ వృద్ధుడిని గుర్తించిన రేణిగుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్‌ నగేశం వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో వృద్ధుడు ఎండ వేడిమిని తట్టుకోలేక తీవ్ర అస్వస్థతతో పడి ఉండటాన్ని గమనించిన నగేశం అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన వృద్ధుడిని ఆప్యాయంగా పలకరించి, వెంటనే తాగునీరు అందించారు. అనంతరం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, వృద్ధుడిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆపదలో ఉన్న వ్యక్తిని చూసి చాలామంది పక్క నుంచి వెళ్లిపోతున్న సమయంలో.. తనకు సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ వృద్ధుడి పరిస్థితిని చూసి స్పందించిన నగేశం తీరును పలువురు అభినందించారు. ఆపదలో ఉన్న మనిషికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అన్న సందేశాన్ని తన చర్య ద్వారా మాజీ సర్పంచ్‌ నగేశం చాటిచెప్పారని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు కేవలం రాజకీయ, సామాజిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని పలువురు అన్నారు. వృద్ధుడి పరిస్థితిని గమనించి వెంటనే స్పందించి, నీరు అందించి, 108 ద్వారా ఆస్పత్రికి తరలించడంలో చొరవ చూపిన మాజీ సర్పంచ్‌ నగేశంను పలువురు అభినందించారు. నిస్సహాయుడికి నీడగా.. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తంగా నిలిచిన నగేశం మానవత్వానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు.

    అత్యధికంగా చదివినవి