Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కులం కాదు... మతం కాదు... ప్రాంతం కాదు... రాజకీయ రంగు కాదు... ప్రజలే ఆయనకు మతం, సేవే ఆయన సిద్ధాంతం

    కులం కాదు... మతం కాదు... ప్రాంతం కాదు... రాజకీయ రంగు కాదు... ప్రజలే ఆయనకు మతం, సేవే ఆయన సిద్ధాంతం

    కులం కాదు... మతం కాదు... ప్రాంతం కాదు... రాజకీయ రంగు కాదు... ప్రజలే ఆయనకు మతం, సేవే ఆయనకు సిద్ధాంతం.

    ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, ప్రజాసంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన మహానేత, దివంగత డాక్టర్ వై . ఎస్ . రాజశేఖర రెడ్డి .

    ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో తన పాలనతో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిన నాయకుడు. మాట ఇస్తే నిలబెట్టుకునే నిబద్ధత, పేదల బాధను తన బాధగా భావించే మానవత్వం, అధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.

    ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వృద్ధులు–వితంతువులకు పెన్షన్లు, రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలతో కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రజానాయకుడు.

    ఇవి కూడా చదవండి

    రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసేందుకు పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్లి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అపూర్వ విజయాన్ని సాధించిన నాయకత్వం ఆయనది.

    ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని స్వయంగా తెలుసుకోవాలనే తపనతో పర్యటనలో ఉండగానే దురదృష్టవశాత్తు కన్నుమూసినా... ఆయన ఆశయాలు, ఆయన సేవలు, ఆయనపై ప్రజల ప్రేమ మాత్రం ఎన్నటికీ మరణించవు.

    "నాయకులు ఎందరో వస్తారు... కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకులు కొందరే. అలాంటి మహానేత డాక్టర్ వైఎస్సార్."

    ఆ మహానేత జన్మదిన సందర్భంగా మా ఘన నివాళులు.
    ఆయన ఆశయాలు చిరంజీవిగా నిలవాలని ఆకాంక్షిస్తూ...

    అత్యధికంగా చదివినవి