Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనే మహిళా, చిన్నారుల భద్రతకు బలమైన పునాది.

    విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనే మహిళా, చిన్నారుల భద్రతకు బలమైన పునాది.

    తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
    తేదీ: 07-07-2026.

    - విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనే మహిళా, చిన్నారుల భద్రతకు బలమైన పునాది.

    - ఎస్‌వీఐఎంఎస్ నర్సింగ్ కళాశాలలో మహిళా పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం.

    - పోక్సో చట్టం, మహిళల హక్కులు, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై సమగ్ర అవగాహన.

    - మాదకద్రవ్యాల వ్యసనం, మహిళలు–చిన్నారులపై నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచన.

    - ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు, లక్ష్యసాధనతో కూడిన విద్యపై ప్రేరణాత్మక సందేశం.

    ఇవి కూడా చదవండి

    తిరుపతి:07
    తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ తమిమ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలోని ఎస్‌వీఐఎంఎస్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    విద్యార్థులకు పోక్సో (POCSO) చట్టం, మహిళల హక్కులు, న్యాయ అవగాహన, మహిళలపై జరిగే నేరాలు, చిన్నారులపై లైంగిక సంబంధించిన నేరాలు, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై సమగ్రంగా వివరించారు.

    అదేవిధంగా విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ ఉద్యోగాల ప్రాముఖ్యత, భవిష్యత్తులో అందుబాటులో ఉండే ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించి, మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొని అవగాహన పొందారు.

    తిరుపతి జిల్లా పోలీస్ శాఖ మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, విద్యాసంస్థలు మరియు సమాజంలో నిరంతరం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తోంది.

    అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసుల అత్యవసర సేవల నంబర్ 112కు, మహిళల సహాయానికి 181కు, సైబర్ మోసాలకు 1930కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తిరుపతి జిల్లా పోలీసులు సూచించారు.

    ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లు దీపిక, కుళ్లాయప్ప, నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, తిరుపతి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సుజాత, శక్తి బృందం మరియు ఈగల్ బృందం సభ్యులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి