జలధారతో కనగిరి పెద్ద చెరువుకు జలకళ

కలికిరి, జూలై 23 (రాజనీతి): జలధార కార్యక్రమంతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కనగిరి పెద్ద చెరువును పరిశీలించిన ఆయన, 36 ఎంసీఎఫ్‌టీల సామర్థ్యానికి ప్రస్తుతం 27 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉందని, దీంతో 175 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు వివరించారు. అనంతరం దండువాంచెరువు బ్రీచ్ మరమ్మతు పనులను పరిశీలించిన కలెక్టర్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.