ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్..
దేశంలో భారీ ఉగ్ర కుట్రకు వ్యూహం పన్నిన ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకొన్న పోలీసులు నిఘా ఉంచి వారిని పట్టుకొన్నారు. పట్టుబడినవారిలో ఉగ్రవాదులు బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ హసన్, మహమ్మద్ సునాసర ఉన్నారు.