కరువు బాధిత గ్రామీణ కుటుంబాలకు జీవన భృతి కల్పించాలి: బీకేవైఎం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప

పుంగనూరు, జూలై 16 (రాజనీతి): గ్రామీణ ప్రాంతాల్లో కరువు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ కూలీలకు జీవన భృతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేవైఎం) జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. పుంగనూరులో జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు విస్తృతంగా కల్పించి రోజుకు రూ.700 కూలి చెల్లించాలని కోరారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సాయం అందించాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేసి భూములు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.