హైరిస్క్ గర్భిణుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం
మేళ్లచెరువు, జూలై 16 (రాజనీతి): హైరిస్క్ గర్భిణులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలంటే పౌష్టికాహారంతో పాటు ఆరోగ్య సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి సూచించారు.తలుపుల పీహెచ్సీ ఆధ్వర్యంలో మేళ్లచెరువులో నిర్వహించిన ఆరోగ్య విద్య కార్యక్రమంలో గర్భిణులకు సమతుల ఆహారం, క్రమం తప్పని వైద్య పరీక్షలు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగం, ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.