24న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయాలి
మదనపల్లి, జూలై 14 (రాజనీతి): ఈనెల 24న మదనపల్లిలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు. మొలకలచెరువు సీపీఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ భూమిలేని పేదలకు భూపంపిణీ, ఉపాధి హామీ పనుల విస్తరణ, వలసల నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశానికి రాష్ట్ర నాయకులు ఆవుల శేఖర్, ఏ. రామానాయుడు, సీహెచ్. కోటేశ్వరరావు తదితరులు హాజరవుతారని తెలిపారు.