మహారాష్ట్రలో భూకంపం.. తెలంగాణలో పలుచోట్ల ప్రకంపనలు
హింగోలి–నాందేడ్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం.. నిజామాబాద్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో స్వల్ప ప్రకంపనలు మహారాష్ట్రలోని హింగోలి–నాందేడ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం 3.6, 3.9, 4.1 తీవ్రతలతో పలు అనంతర ప్రకంపనలు (Aftershocks) నమోదయ్యాయి. ఈ ప్రకంపనల ప్రభావం తెలంగాణ ఉత్తర జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కనిపించింది. తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో పలుచోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని రాష్ట్ర, జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది....