SIR కార్యక్రమం తుది దశకు చేరుకుంది

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చివరి దశలోకి.. 70 శాతం దరఖాస్తుల డిజిటలైజేషన్ పూర్తి.... ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తుల్లో సుమారు 70 శాతం వరకు డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లోని పొరపాట్లను సరిదిద్దేందుకు బూత్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు కొనసాగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ధృవీకరించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి