గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ కట్ట పుట్టలమ్మ గుడి సమీపంలో సుమారు 45–50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలంలో సగం తాగిన మద్యం సీసా లభించడంతో మద్యం సేవించిన అనంతరం డీహైడ్రేషన్ లేదా ఇతర సహజ కారణాలతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని తెలిపారు. ఎరుపు–నలుపు చెక్స్ షర్ట్ ధరించిన ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు, కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.