హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో సమన్వయంతో పనిచేయాలి – జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీటీసీ (ICTC), డీఎస్ఆర్ఎస్ (DSRS) కౌన్సిలర్ల సమావేశం సోమవారం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో కౌన్సిలర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రతి వ్యక్తికి గోప్యతను కాపాడుతూ నాణ్యమైన కౌన్సెలింగ్ సేవలు అందించాలని, హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్స, ఫాలోఅప్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని ఐసీటీసీ కేంద్రాల్లో సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తులకు మానసిక ధైర్యాన్ని అందిస్తూ, చికిత్సను...