జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ పెంపు చేయాలని తిరుపతిలో నిరసన

జూనియర్ న్యాయవాదులకు అందిస్తున్న నెలవారీ స్టైఫండ్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో జూనియర్ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రెండు సంవత్సరాలుగా రూ.17 వేల స్టైఫండ్‌లో ఎలాంటి పెంపు లేకపోవడంతో జీవనోపాధి భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో ప్లకార్డులతో నిరసన చేపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్టైఫండ్‌ను పెంచి అర్హులైన ప్రతి జూనియర్ న్యాయవాదికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.