తిరుపతిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఘన సన్మానం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ప్రజలకు చేరువగా ఉంటూ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న సందర్భంగా, ఈరోజు తిరుపతి నగరానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ఆర్.సి. మునికృష్ణ గారు మరియు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి శ్రీ ఆర్.పి. శ్రీనివాసులు గారు శాలువాతో, శ్రీవారి తీర్థప్రసాదాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.