ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి! డా. లోకవర్ధన్ పీలేరు ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి లోకవర్ధన్ ఈరోజు ఏరియా ఆసుపత్రి పీలేరు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలపై ఆరాధీసారు వివిధ రకాల సేవలు 104 108 విభాగాలను సందర్శించారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు అందుతున్న ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించారు అలాగే సిబ్బందికి సూచనలు సలహాలు తెలియజేశారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గా తీసుకొని. అమలు చేస్తోందని ఇందులో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించారు.. ఆస్పత్రిలో ఉండే వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.