కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు

తిరుమల–తిరుపతి పర్యటన ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమైన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. కుటుంబ సమేతంగా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తదితర అధికారులు వీడ్కోలు పలికారు. తిరుమల పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రత్యేక విమానంలో ఆయన కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.