గాజులమండ్యం పట్టాభిరామ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

రేణిగుంట మండల పరిధిలోని గాజులమండ్యం గ్రామంలోని సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీశ్రీశ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ, శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, జలాధివాసం, ధాన్యాధివాసం వంటి వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. 25న ప్రధాన కుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.