రేణిగుంట బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

రేణిగుంట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, అనారోగ్యం, వడదెబ్బ,ఇతర సహజ కారణాలతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.మృతుడు నలుపు రంగు షర్ట్‌పై పసుపు చారలు, గోధుమ రంగు డిజైన్ లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.