వెలుగుల వెనుక.. మునిచంద్ర పర్యవేక్షణ!...
విద్యుత్ సరఫరాలో నిరంతర సేవలకు మునిచంద్ర నాయకత్వం..... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం విద్యుత్ శాఖకు అత్యంత కీలకమైన బాధ్యత.విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడినా.. సాంకేతిక సమస్య తలెత్తినా.. దాన్ని వీలైనంత త్వరగా గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత ఆపరేషన్స్ విభాగంపై ఉంటుంది. ఈ క్రమంలో చిత్తూరు యం. మునిచంద్ర ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆపరేషన్), ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలోని ఆపరేషన్స్ వ్యవస్థ కీలకంగా పనిచేస్తోంది.విద్యుత్ శాఖలో ఆపరేషన్స్ విభాగం అంటే కేవలం విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడమే కాదు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, ఫీడర్లు, ఇతర విద్యుత్ పరికరాల పనితీరును నిరంతరం...