వైష్ణవి దేవి ఆలయంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు

రాజనీతి | పుంగనూరు | ఆగస్టు 14, 2026 చౌడేపల్లి మండలం, పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి, అభయాంజనేయ స్వామికి, నాగభైరవ స్వామికి, పంచామృత అభిషేకం చేసి అనంతరం రంగురంగు పూలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మదనపల్లి, చౌడేపల్లి ,పుంగనూరు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు ఉభయ దారులుగా మదనపల్లికి చెందిన చంద్రశేఖర్ లలిత కుమారి గా వ్యవహరించారు.