రెండో రోజు విజయవంతంగా సీపీఐ పాదయాత్ర
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలో సీపీఐ చేపట్టిన ప్రజా సమస్యల పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. బీసీ కాలనీ, బెంగళూరు రోడ్, మగ్గాల వీధి, బిలాల్ మసీదు, చర్చి వీధుల్లో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతులు, పక్కా ఇళ్లు, పింఛన్లు, ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ హామీ ఇచ్చింది.