పంటల భీమా నమోదు గడువు పెంచాలి : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ

చౌడేపల్లి ఆగస్టు 1 రాజనీతి న్యూస్ : పంటల భీమా నమోదు గడువును పెంచాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు శనివారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం నమోదు ప్రక్రియను జూలై 31 వరకు ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయితుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారని దీనివల్ల రైతులు పంట నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున భీమా సదుపాయాన్ని మరింతగా గడువు పెంచాలని ఆయన అన్నారు అంతేకాకుండా సంబంధిత సర్వర్లు పనిచేయకుండా పోవడంతో ఆలస్యం...