ప్రయాణం కాదు.. ప్రాణం ముఖ్యం: చౌడేపల్లి పోలీసుల వినూత్న అవగాహన

చౌడేపల్లి, జూలై 31 (రాజనీతి): రోడ్డు ప్రమాదాల నివారణకు చౌడేపల్లి పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య నిద్రమత్తులో ప్రయాణించే లారీ, బస్సు, కారు, ఆటో డ్రైవర్లకు చల్లని నీరు అందించి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయ్యాకే ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు. చలానాలు విధించడమే కాకుండా వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, ముఖ్యంగా లారీ డ్రైవర్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.