జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరసన

పీలేరు, జూలై 31 (రాజనీతి): ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ పీలేరులో జర్నలిస్టులు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు జాకీర్ పఠాన్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఆర్డీవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలం, అటాక్స్ కమిటీ, స్వయంప్రతిపత్తి కలిగిన మీడియా కమిషన్, ప్రెస్ అకాడమీ గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.