పీలేరు ఆర్డీవోగా కె. విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

పీలేరు, జూలై 29 (రాజనీతి): పీలేరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) కె. విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కుప్పం ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై పీలేరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఏవో నరసింహకుమార్ ఆధ్వర్యంలో పూర్ణకుంభం, మేళతాళాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.