మతం మారితే ఎస్సీ హోదా రాదు.. మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులం (SC) హోదా కొనసాగింపుపై దాఖలైన పునఃసమీక్ష పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు అవసరం లేదని స్పష్టం చేస్తూ, మత మార్పిడితో ఎస్సీ హోదా అంశంపై మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటించింది. పిటిషనర్లు సమర్పించిన వాదనలను పరిశీలించిన ధర్మాసనం, ఇప్పటికే ఈ అంశంపై రాజ్యాంగం, చట్టపరమైన నిబంధనలు, గత తీర్పుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం వెలువడిందని పేర్కొంది. అందువల్ల తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. భారత రాజ్యాంగంలోని 1950 రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం, షెడ్యూల్డ్ కులాల హోదా నిర్దిష్ట మతాలకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అదే తీర్పును కొనసాగిస్తూ,...