🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

డాక్యుమెంట్ రైటర్లకు అండగా మాజీ ఎమ్మెల్యే చింతల.. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్!

వాల్మీకిపురం, జూలై 23:
సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల సేవలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

గురువారం ఉదయం వాల్మీకిపురం పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుని, ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి భంగం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు.

ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home