రెయిన్బో స్కూల్ ఎస్పీఎల్ ఎన్నికల్లో రాణా ప్రతాప్ విజయం
రేణిగుంట, జూలై 22 (రాజనీతి): రేణిగుంట పట్టణంలోని రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్లో నిర్వహించిన స్టూడెంట్ పార్లమెంట్ లీడర్ (ఎస్పీఎల్) ఎన్నికల్లో 8వ తరగతి విద్యార్థి కె. చౌడేశ్వరి రానా ప్రతాప్వి జయం సాధించాడు. విద్యార్థులు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎస్పీఎల్గా రానా ప్రతాప్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విజేతను అభినందిస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేలా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.