🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

జర్నలిస్టులకు నోటీసులపై నెల్లూరులో అత్యవసర సమావేశం

నెల్లూరు, జూలై 21 (రాజనీతి): మనుబోలు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తల నేపథ్యంలో జర్నలిస్టులకు పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరోలు, ఇన్‌చార్జీలు అత్యవసర సమావేశం నిర్వహించారు. యూనియన్లకు అతీతంగా సమావేశమైన మీడియా ప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు.
🏠 Home