🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jul, 2026 | Page: 1

11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్

పీలేరు, జూలై 20 (రాజనీతి): అన్నమయ్య జిల్లా కేవీపల్లి–పీలేరు మార్గంలోని పొంతల చెరువు క్రాస్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో కారులో ఎర్రచందనం దుంగలను గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, పట్టుబడిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🏠 Home