🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jul, 2026 | Page: 1

ప్రధానోపాధ్యాయుడి కుమారుడికి నీట్‌లో ఆల్ ఇండియా 316వ ర్యాంకు

పీలేరు జూలై 17 (రాజనీతి): మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎదిగి ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రధానోపాధ్యాయుడు డి. పరమేశ్వర రాజుకు మరో గర్వకారణం దక్కింది. ఆయన కుమారుడు డి. రోహిత్ తాజాగా ప్రకటించిన నీట్–2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 316వ ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబరిచాడు. ఈ విజయంతో తల్లిదండ్రుల పేరు ప్రతిష్ఠలను నిలబెట్టడమే కాకుండా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. రోహిత్‌కు పలువురు విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
🏠 Home