ఎన్టీఆర్ వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీ.. రోగులతో మాట్లాడిన జిల్లా సమన్వయకర్త
పీలేరు, జూలై 16 (రాజనీతి): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్ పీలేరులోని శశి ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేయగా, పథకం అమలును నిబంధనలకు అనుగుణంగా కొనసాగించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.