🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 14 Jul, 2026 | Page: 1

టీబీ నిర్మూలన, డెంగీ నివారణకు ప్రజల సహకారం అవసరం: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ

గుర్రంకొండ, జూలై 14 (రాజనీతి): టీబీ ముక్త్ భారత్ అభియాన్, డెంగీ మాసోత్సవాలు, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతం చేయాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. తరిగొండ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మర్రిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టీబీ లక్షణాలు, ఉచిత పరీక్షలు, చికిత్స, డెంగీ నివారణ చర్యలు, కుటుంబ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి పరిశుభ్రత, దోమల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.
🏠 Home