🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Jul, 2026 | Page: 1

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారించి తక్షణ చర్యలు తీసుకోవాలి మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీలేరు అర్. డి. ఓ. కు ఫిర్యాదు

పీలేరు మండలం కాకులారం పల్లి పంచాయతీ దొడ్డిపల్లి గ్రామం నందు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నేడు పీలేరు రెవిన్యూ డివిజన్ అధికారి నారాయణ రెడ్డి గారికి మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
** సర్వే నెం :1954 లో (1.0000 ఎకరా గుట్ట),

** 1974/7 లో (1.0000 ఎకరా),

1079/1 లో (1.1000. సెంట్లు),

1076/1 లో (0.5900 సెంట్లు),

1078/1లో (3.97000 సెంట్లు),

1078/2 లో (2.0000 ఎకరాలు),

1139/10 (0.3700 సెంట్లు),

1999 లో (4.3200 సెంట్లు) పై పేర్కొన్న సర్వే నెంబర్ లలో గల గయ్యాళ్లు,గ్రామకంఠాలు,పోరంబోకు, గుట్టలు,వంటి ప్రభుత్వ భూములపై రోజు,రోజుకూ పెరుగుతున్న ఆక్రమణలపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని సమాజానికి ఆస్తిగా ఉండాల్సిన ప్రభుత్వ స్థలాలు,బడాబాబులు, భూబకాసురులు,అగ్రకుల పెట్టాందారులు,స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించడానికి వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించాలి ఎలాంటి పక్షపాతం లేకుండా ఆక్రమణలను తక్షణమే తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి
భూములను రక్షించి, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి
ప్రభుత్వ స్థలాలు మళ్లీ ఆక్రమణకు గురికాకుండా గట్టి నిఘా మరియు రక్షణ చర్యలను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆస్తులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవిన్యూ శాఖ మంత్రి,భూ పరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లా కలెక్టర్,గార్ల కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నట్టు తెలిపారు కార్యక్రమంలో నాయకులు కొత్త పేట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home