డా. ఎన్టీఆర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి.. పుంగనూరు ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా సమన్వయ అధికారి డా. పి. లోకవర్ధన్!
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ పి లోకవర్ధన్ ఈరోజు ఏరియా ఆసుపత్రి పుంగనూరును సందర్శించారు ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం పొందుతున్న లబ్ధిదారులను పరామర్శించారు వైద్య సేవలు అందుబాటుపై ఆరా తీశారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే పుంగనూరులోని 104 సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు 104 సేవా కేంద్రం ద్వారా అందుతున్న సేవలను మరియు మందులను నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అని చూశారు.