🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Jul, 2026 | Page: 1

సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి – పీలేరులో ఘన నివాళులు

అన్నమయ్య జిల్లా పీలేరు
06-07-2026

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వాతంత్ర్యం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40 వర్ధంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సమానత్వం దళితుల ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు భారత మాజీ ఉప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు 'బాబూజీ'గా ప్రజల గుండెల్లో నిలిచిన ఆయన సేవలు త్యాగాలు ప్రతి భారతీయుడికి ఆదర్శం వ్యవసాయ,రక్షణ,రైల్వే శాఖల్లో ఆయన చేసిన సంస్కరణలు దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడతాయని ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడుద్దాం అని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో నడిమికండ్రిగ సుధాకర్ బాబు,తుమ్మల ధరణ్ కుమార్, నగరిమడుగు సుభాష్, జెట్టి మల్లికార్జున,కొత్త పేట ప్రసాద్, సద్దల శ్రీకాంత్, బోయిని చంద్ర శేఖర్, తెరకాల్ల క్రిష్ణయ్య, పాల్గొని ఘన నివాళులు అర్పించినారు
🏠 Home