పీలేరు నియోజకవర్గం:రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం విజయోత్సవం
పీలేరు: పీలేరు నియోజకవర్గం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గం MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పాల్గొని పీలేరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి వేడుకలు చేశారు. గత రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా MLA MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజల నమ్మకంతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమయ్యాయి. మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పీలేరు నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం” అని తెలిపారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.