పతక వీరులతో మోదీ ముచ్చట్లు.. “జో ఖేలేగా.. వో ఖిలేగా”
రాజనీతి ప్రతినిధి | న్యూఢిల్లీ | ఆగస్టు 10, 2026
కామన్వెల్త్ గేమ్స్-2026లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో భారత పతక విజేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో క్రీడాకారులు కనబరిచిన ప్రతిభను ప్రశంసిస్తూ, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా క్రీడాకారులతో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాక్సింగ్లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరి మోదీని కొన్ని మాటలు చెప్పాలని కోరగా.. “జో ఖేలేగా, వో ఖిలేగా.. ఆల్వేస్ చీర్ ఫర్ భారత్” అంటూ ప్రధాని ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేశారు.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఈసారి భారత బాక్సర్ల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. 14 మంది బాక్సర్లు బరిలోకి దిగగా 10 మంది పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణ పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో ఒకే ఎడిషన్లో భారత బాక్సింగ్ జట్టు సాధించిన అత్యధిక పతకాలుగా ఇది నమోదైంది.
జూడోలోనూ భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా స్వర్ణ పతకం సాధించడంతో పాటు, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్ తదితర విభాగాల్లోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ విజయాలు దేశంలోని యువతకు క్రీడలపై మరింత ఆసక్తి పెంచుతాయని మోదీ పేర్కొన్నారు.
కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల సందర్భంగా 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా వేడుకలు జరగనున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్-2026లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో భారత పతక విజేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో క్రీడాకారులు కనబరిచిన ప్రతిభను ప్రశంసిస్తూ, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా క్రీడాకారులతో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాక్సింగ్లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరి మోదీని కొన్ని మాటలు చెప్పాలని కోరగా.. “జో ఖేలేగా, వో ఖిలేగా.. ఆల్వేస్ చీర్ ఫర్ భారత్” అంటూ ప్రధాని ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేశారు.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఈసారి భారత బాక్సర్ల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. 14 మంది బాక్సర్లు బరిలోకి దిగగా 10 మంది పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణ పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో ఒకే ఎడిషన్లో భారత బాక్సింగ్ జట్టు సాధించిన అత్యధిక పతకాలుగా ఇది నమోదైంది.
జూడోలోనూ భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా స్వర్ణ పతకం సాధించడంతో పాటు, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్ తదితర విభాగాల్లోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ విజయాలు దేశంలోని యువతకు క్రీడలపై మరింత ఆసక్తి పెంచుతాయని మోదీ పేర్కొన్నారు.
కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల సందర్భంగా 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా వేడుకలు జరగనున్నాయి.