పొగాకు రైతులకు భారీ ఊరట.. క్వింటాల్కు రూ.1,000 అదనం!
రాజనీతి ప్రతినిధి | అమరావతి | ఆగస్టు 10, 2026
పొగాకు ధరల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రతి క్వింటాల్ పొగాకుకు ప్రభుత్వం తరఫున రూ.1,000 అదనపు సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలను రెండేళ్ల కాలపరిమితితో అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పొగాకు ధరలు, కొనుగోళ్ల పరిస్థితిపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. రైతులకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత నిర్ధారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యాపారులు నాణ్యత పేరుతో తక్కువ ధరలు నిర్ణయించకుండా పర్యవేక్షణ పెంచనున్నట్లు తెలిపారు.
మరో కీలక నిర్ణయంగా పొగాకు కొనుగోలు పూర్తైన తర్వాత 9 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రులు తెలిపారు. వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు కూడా వెల్లడించారు. అధిక ఉత్పత్తి కారణంగా ధరలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం, అలాగే లో, హాఫ్స్టైల్ పొగాకుకు కిలోకు రూ.10 రాష్ట్ర ప్రభుత్వ మద్దతు వంటి చర్యలు ప్రకటించబడ్డాయి. సుమారు 40 వేల మంది రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో వెల్లడించారు.
ధరల విషయంలో రైతులకు మరింత భరోసా కల్పించేందుకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రెండు నెలల్లో రోజుకు 20 లక్షల కిలోల వరకు పొగాకు వేలం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సమాచారం.
పొగాకు ధరల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రతి క్వింటాల్ పొగాకుకు ప్రభుత్వం తరఫున రూ.1,000 అదనపు సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలను రెండేళ్ల కాలపరిమితితో అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పొగాకు ధరలు, కొనుగోళ్ల పరిస్థితిపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. రైతులకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత నిర్ధారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యాపారులు నాణ్యత పేరుతో తక్కువ ధరలు నిర్ణయించకుండా పర్యవేక్షణ పెంచనున్నట్లు తెలిపారు.
మరో కీలక నిర్ణయంగా పొగాకు కొనుగోలు పూర్తైన తర్వాత 9 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రులు తెలిపారు. వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు కూడా వెల్లడించారు. అధిక ఉత్పత్తి కారణంగా ధరలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం, అలాగే లో, హాఫ్స్టైల్ పొగాకుకు కిలోకు రూ.10 రాష్ట్ర ప్రభుత్వ మద్దతు వంటి చర్యలు ప్రకటించబడ్డాయి. సుమారు 40 వేల మంది రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో వెల్లడించారు.
ధరల విషయంలో రైతులకు మరింత భరోసా కల్పించేందుకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రెండు నెలల్లో రోజుకు 20 లక్షల కిలోల వరకు పొగాకు వేలం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సమాచారం.