దగా డీఎస్సీ’పై పుంగనూరులో వైసీపీ ర్యాలీ
పుంగనూరు, ఆగస్టు 10 (రాజనీతి): డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. ర్యాలీ నేపథ్యంలో సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.