🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Aug, 2026 | Page: 1

పద్మావతి నగర్ డ్రైనేజీ సమస్యకు పరిష్కార చర్యలు

పీలేరు పట్టణంలోని పద్మావతి నగర్‌లో మురుగునీటి పారుదల సమస్యపై మేజర్ పంచాయతీ ఈవో రవీంద్రారెడ్డి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి భూగర్భ డ్రైనేజీకి అనుసంధానం చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుర్తించారు. ఇందుకోసం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అనుమతి కోరుతూ లేఖ పంపనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
🏠 Home