శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
పాకాల మండలం ఊట్లవారిపల్లిలోని ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, రహదారులు, దర్శన ఏర్పాట్లను మెరుగుపర్చాలని సూచించారు.