🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Aug, 2026 | Page: 1

స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు నెలలు పట్టే అవకాశం

అమరావతి, ఆగస్టు 5 (రాజనీతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా సవరణ, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు.
🏠 Home