రౌడీషీటర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ జయచంద్ర
రేణిగుంట, ఆగస్టు 2 (రాజనీతి): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.