🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 02 Aug, 2026 | Page: 1

కమల వికాసం' ధ్యేయంగా బీజేపీ మండల సమావేశం

బి.ఎన్. కండ్రిగ, ఆగస్టు 2 (రాజనీతి): పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి విస్తరణ లక్ష్యంగా బీజేపీ మండల పదాధికారుల సమావేశం మండల అధ్యక్షుడు గురునాధం అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home