"DSCలో నిజాలు బయటపడాలి".. CBI విచారణ కోరుతూ వైసీపీ వినతిపత్రం!
రాజనీతి | 31 జూలై 2026
రాష్ట్రంలో DSC నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ CBIతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్కు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని, నియామక ప్రక్రియపై పూర్తి పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
DSC నియామకాలకు సంబంధించిన అన్ని అంశాలపై CBI విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో DSC నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ CBIతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్కు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని, నియామక ప్రక్రియపై పూర్తి పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
DSC నియామకాలకు సంబంధించిన అన్ని అంశాలపై CBI విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.